తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సచిన్​, రోహిత్​, దియా మీర్జాలకు యువీ ఛాలెంజ్​​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ సోషల్​ మీడియాలో సరికొత్త ఛాలెంజ్​ను ప్రారంభించాడు. దీన్ని కొనసాగించాలని పలువురిని నామినేట్​ చేశాడు.

By

Published : May 15, 2020, 11:09 AM IST

Updated : May 15, 2020, 11:54 AM IST

Yuvraj Singh Names Top Stars For 'Keep It Up' Challenge
సచిన్​, రోహిత్​ల​కు ఛాలెంజ్​ విసిరిన యువరాజ్​

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లకు ఓ సరికొత్త సవాలు విసిరాడు. 'KeepItUp​' అనే ఛాలెంజ్​ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్​ చేశాడు. అందులో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, రోహిత్​ శర్మ, హర్భజన్​ సింగ్​తో పాటు యునైటెడ్​ నేషన్స్​, నటి దియా మీర్జా ఉన్నారు.

ఈ వీడియోలో యువరాజ్​.. బ్యాట్​తో బంతిని కొడుతూ ఇదే విధంగా తాను నామినేట్​ చేసిన వారు వీడియో తీసి పోస్ట్​ చేయాలని కోరాడు. ఈ ఛాలెంజ్​కు #KeepItUP​ అనే హ్యాష్​ట్యాగ్​ను జోడించాడు. ఇటీవలే రోహిత్​శర్మ, యువరాజ్​ సింగ్​ లైవ్​ సెషన్​లో ముచ్చటించారు. ఆ సందర్భంగా వారిద్దరూ తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

'యువీ నా ఫెవరేట్​'

భారత జట్టులోకి వచ్చినప్పుడు యువరాజ్​ తన ఫేవరెట్​ క్రికెటర్​ అని రోహిత్​శర్మ అన్నాడు. యువీతో మాట్లాడాలని, అతను ఎలా ఆడతాడో.. ఏమి చేస్తాడో చూడాలనిపించేదని ఆ సందర్భంగా వెల్లడించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సచిన్ తెందూల్కర్​, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు కలిసి గతంలో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఇదీ చూడండి.. కేంద్రం అనుమతిస్తే క్రికెటర్లకు శిక్షణ: ధుమాల్​

Last Updated : May 15, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details