తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భర్త, అత్త వేధింపులకు మహిళ బలవన్మరణం - Vivahitha Sucide

భర్త, అత్త సూటిపోటి మాటలు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం భర్త, అత్త వేధింపులేనని గోడపై రాసిపెట్టి మరీ తనువు చాలించింది. అనుమానపు మాటలతో నరకం చూపించేవారని తన గోడుని గోడపై రాసింది.

తన గోడుని గోడపై రాసి...

By

Published : May 15, 2019, 11:49 PM IST

తన గోడుని గోడపై రాసి...
బాచుపల్లి ఠాణా పరిధిలోని నిజాంపేటలో పుష్పలత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు భర్త, అత్తే కారణమని గోడపై రాసి... ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతకు తలుపులు తెరవకపోవటం వల్ల అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వాళ్లు కిటికీలో నుంచి చూడగా... పుష్పలత విగతజీవిగా వేలాడుతూ కనిపించింది.

అనుమానంతో మాటలు...

వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, పుష్పలత(24)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బతుకు దెరువు కోసం మూడు నెలల క్రితం నిజాంపేట గ్రామానికి వలస వచ్చారు. కూకట్​పల్లి హౌసింగ్ బోర్డ్​లోని మంజీరా షాపింగ్ మాల్​లో సెక్యురిటీగా రాజశేఖర్​, హౌస్ కీపింగ్​గా పుష్పలత పని చేస్తున్నారు. భార్యభర్తలు తరుచూ గొడవ పడేవారు. ఎప్పుడూ తన ఫోన్​లో నెంబర్లు తనిఖీ చేస్తూండేవాడని... అనుమానంతో వేధించేవాడని గోడపై పుష్పలత రాసింది. భర్త వేధింపులకు తోడు అత్త సూటిపోటి మాటలు కూడా తోడవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలిస్తున్నట్లు రాసుకొచ్చింది పుష్పలత.

స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: డ్రగ్​ కేసులో సినీతారలకు క్లీన్​చిట్​ ఇవ్వలేదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details