తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2021, 1:27 PM IST

ETV Bharat / briefs

'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

వ్యాక్సిన్‌ మైత్రి ద్వారా 80కి పైగా దేశాలతో టీకాలను పంచుకున్నట్లు ఐరాసకు భారత్ తెలిపింది. ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులను ప్రపంచ దేశాలకు అందించినట్లు వెల్లడించింది. 150కి పైగా దేశాలకు ఔషధాలను సరఫరా చేసినట్లు వివరించింది. మరోవైపు, భారత్​కు తమ విభాగాలు సాయం అందిస్తున్నాయని ఐరాస పేర్కొంది.

UN helping India fight Covid-19: spokesman
'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితులు ఉన్నా తమ పరిధి మేర 80కి పైగా దేశాలతో టీకాలను పంచుకున్నట్లు ఐక్యరాజ్య సమితికి భారత్‌ వివరించింది. 150కి పైగా దేశాలకు ఔషధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేసినట్లు ఐరాస విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌(సీడీసీ)కి తెలిపింది. ఈ మేరకు సీడీసీ సమావేశంలో మాట్లాడిన భారత శాశ్వత మిషన్‌ కౌన్సిలర్‌ అమర్​నాథ్‌.. భారత్‌ తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ మైత్రి ద్వారా పొరుగు దేశాలతో పాటు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలకు టీకాలను సరఫరా చేసినట్లు చెప్పారు.

ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులను ప్రపంచ దేశాలకు అందించినట్లు ఐరాసకు భారత్‌ తెలిపింది. గత దశాబ్దాల కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు.. కరోనా అని సీడీసీలో భారత్‌ పేర్కొంది. మరోవైపు, వైరస్‌పై తప్పుడు సమాచారం వ్యాప్తి పెరిగిందన్న భారత్‌.. నిజమైన సమాచారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు సీడీసీ సెషన్‌లో పేర్కొంది. ఆ దిశగా ఐరాస కృషి చేయాలని సీడీసీకి విన్నవించింది.

సాయం చేస్తున్నాం: ఐరాస

భారత్‌లోని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు 7 వేల వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు కొవిడ్ 19 టెస్టింట్‌ కిట్‌లు, పీపీఈ కిట్లు కొనుగోలు చేసి అందిస్తున్నట్లు ఐరాస తెలిపింది. మొబైల్ ఆస్పత్రులు కూడా నెలకొల్పి సేవలందిస్తున్నట్లు పేర్కొంది. భారత్ కోరుకుంటే తమ సమీకృత సప్లై చైన్ ద్వారా సేవలందించేందుకు సిద్ధమని యూఎన్ మరోసారి పునరుద్ఘాటించింది. ఇప్పటికే దాదాపు 2,600 మంది డబ్ల్యూహెచ్ఓ ఫీల్డ్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా కట్టడికి యూనిసెఫ్ తమ నిపుణులను క్షేత్రస్థాయిలో నియమించిందని ఐరాస వివరించింది. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరాయంగా ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పింది. 4 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తీసుకొచ్చేందుకు విమానాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి దగ్గర.. దేశంలో కొవిడ్ పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి-కరోనా విజృంభణతో చార్​ధామ్​ యాత్ర వాయిదా

ABOUT THE AUTHOR

...view details