తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2019, 9:53 PM IST

ETV Bharat / briefs

నీరవ్ బెయిల్ తీర్పు రేపటికి వాయిదా

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ బెయిల్ పిటిషన్​పై తీర్పును లండన్​లోని రాయల్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. నీరవ్ కుట్రపూరిత స్వభావం కలవారు కాదని ఆయన తరఫు న్యాయవాది క్లేర్ మోంటిగొమేరి వాదించారు.

నీరవ్ బెయిల్ తీర్పు రేపటికి వాయిదా

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్​పై లండన్​లోని రాయల్ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటలకు నిర్ణయం వెలువరించనుంది రాయల్స్​ కోర్ట్​ ఆఫ్​ జస్టిస్​. నీరవ్ తరఫున న్యాయవాది క్లేర్ మోంటిగొమేరి వాదనలు వినిపించారు.

"భారత ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఆయన కుట్రపూరిత నేరస్వభావం కలవారు కాదు. ఆయన కేవలం ఓ ఆభరణాల డిజైనర్, వజ్రాల వ్యాపారి. నిజాయతీ, నమ్మకస్తుడైన వ్యక్తి. ఏ దేశానికి చెందిన రాయబార కార్యాలయంలో ఉండాలని నీరవ్ కోరుకోవడం లేదు."
-క్లేర్ మోంటిగొమేరి, కోర్టులో నీరవ్ మోదీ లాయర్ వాదన

నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోదీ ఎక్కడున్నారని న్యాయమూర్తి ఇన్​గ్రిడ్ సిమ్లెర్ ప్రశ్నించారు. కేసుతో సంబంధమున్న జెత్వా ఆచూకీపై ఆరా తీశారు. నీరవ్ అకస్మాత్తుగా లండన్​కు రాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెయిల్ పూచీకత్తును 5 లక్షల పౌండ్లుగా ప్రారంభించారు నీరవ్. ప్రస్తుతం అది 2 మిలియన్ పౌండ్లకు పెరిగింది.

ప్రస్తుతం నీరవ్ తరఫున వాదించే లాయర్లందరూ పెద్దస్థాయి వారని, భారత్​కు అప్పగించేందుకు వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నీరవ్ భారత్​కు వెళ్లడాన్ని తప్పించుకునే అవకాశముందన్నారు.

తిరిగి సరెండర్ కారేమోనన్న అనుమానంతో గతంలో మూడుసార్లు వెస్ట్​ మినిస్టర్​ కోర్టు నీరవ్​ బెయిల్ పిటిషన్​ను తిరస్కరించింది. పంజాబ్​ నేషనల్ బ్యాంకులో రూ. 13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి నీరవ్, మెహుల్ చోక్సీలు భారత్ వదలి లండన్​కు పరారయ్యారు.

ABOUT THE AUTHOR

...view details