తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పది ఫలితాల విషయంలో ఆందోళన అవసరం లేదు - ts-education-department-vijaykumar

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా... విద్యాశాఖ పదోతరగతి ఫలితాల వెల్లడిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ముగిసినా మరోసారి పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని... ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం

By

Published : May 4, 2019, 4:18 PM IST

Updated : May 4, 2019, 4:27 PM IST


పదో తరగతి ఫలితాల వెల్లడిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఫలితాల వెల్లడికి ముందు వివరాలను ఐదు అంచెల్లో తనిఖీ చేస్తున్నామన్నారు. ఫలితాలు వెల్లడి తరువాత ఎలాంటి సందేహాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఒక సబ్జెక్ట్‌లో అధిక మార్కులు వచ్చి, ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయితే మరోసారి పరిశీలిస్తున్నామని విజయ్​కుమార్​ హామీ ఇచ్చారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయినప్పటికీ... అన్ని సబ్జెక్టులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫలితాల వెల్లడి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని.... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్​కుమార్​ భరోసా ఇచ్చారు.

చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం
Last Updated : May 4, 2019, 4:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details