తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు: రహానే

రాజస్థాన్​తో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో బట్లర్​ను 'మన్కడింగ్'​తో ఔట్​ చేశాడు అశ్విన్. ఈ విషయాన్ని రిఫరీ చూసుకుంటారని రాజస్థాన్ జట్టు కెప్టెన్ రహానే అన్నాడు.

By

Published : Mar 26, 2019, 1:17 PM IST

పై మ్యాచ్​ రిఫరీ నిర్ణయం తీసుకుంటారన్న రాజస్థాన్ కెప్టెన్ రహానే

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ ఎలెవన్​ జట్టు బౌలర్​ అశ్విన్ చేసిన 'మన్కడింగ్' వివాదాస్పదమైంది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే స్పందించాడు. అనవసర చర్చ ఎందుకని అన్నాడు. మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని చూసుకుంటారని తెలిపాడు.

ఈ వివాదంపై మాట్లాడనుకోవట్లేదు. రిఫరీ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఫలితం ఏదైనా అంగీకరిస్తాం. చెప్పాలంటే మేం బాగానే బ్యాటింగ్ చేశాం. చివరి 4 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు -అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్

జైపూర్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్​లో 14 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details