గనుల అనుమతుల జారీ వేగవంతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. కేంద్ర గనుల శాఖ అధికారులతో సచివాలయంలో వార్షిక వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. భేటీలో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ, ఇతర అధికారులు, ఏఎండీ, జీఎస్ఐ, ఎన్ఎండీసీ, ఎంఈసీఎల్, ఎన్జీఆర్ఆ, ఐబీఎం సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సత్వర అనుమతులు పొందేలా సేవలు
అటవీ, పర్యావరణ తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులు సత్వర అనుమతులు పొందేలా సేవలు అందించాలని సీఎస్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ సమావేశం నిర్వహించడం అభినందనీయమన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర గనుల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని... కేంద్ర భౌతిక శాఖ పరిశోధన సంస్థల సహకారంతో ఖనిజాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.