తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అజ్లాన్‌ షా టోర్నీ తొలిమ్యాచ్​లో భారత్​-జపాన్​ ఢీ - hockey india team

ప్రతిష్ఠాత్మక సుల్తాన్​ అజ్లాన్​ షా హాకీ టోర్నీ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. మలేషియాలోని ఇపో వేదికగా జరుగుతున్న ఆతిథ్య మ్యాచ్​లో ఆసియా క్రీడల పసిడి విజేత జపాన్​తో తలపడనుంది భారత్​.

అజ్లాన్‌ షా హాకీ టోర్నీ తొలిమ్యాచ్​లో భారత్​-జపాన్​ ఢీ

By

Published : Mar 23, 2019, 2:46 PM IST

28వ సుల్తాన్ ​అజ్లాన్ షా కప్​లో ఆసియా క్రీడల ఛాంపియన్​ జపాన్​ను భారత పురుషుల హాకీ జట్టు ​ఢీకొట్టనుంది. ​మలేషియాలోని ఇపో వేదికగా మార్చి 23 నుంచి జరిగే ఈ టోర్నీకి.. సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని జట్టు సిద్ధమైంది.

ఆరు జట్ల మధ్య లీగ్​, నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో... భారత్‌ సహా ఆతిథ్య మలేసియా, ఆసియా క్రీడల ఛాంపియన్‌ జపాన్, దక్షిణ కొరియా, కెనడా, పోలండ్‌ దేశాలు పాల్గొంటున్నాయి.

  • ఆరంభంలోనే బలమైన ప్రత్యర్థి:

తొలి రోజు మ్యాచ్​లో జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో భారత్‌ ఆడనుంది. గతంలో జపాన్‌-భారత్​ ఐదు మ్యాచ్​ల్లో తలపడితే... ఐదుసార్లు భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్​ తర్వాత మార్చి 24న దక్షిణ కొరియాతో, 26వ తేదీన మలేసియాతో, 27న కెనడాతో, 29న పోలాండ్‌తో భారత్‌ ఆడనుంది.

  • గతేడాది మిస్సయింది:

2018 టోర్నీలో భారత్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 36 ఏళ్లలో భారత్‌ ఐదుసార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఏడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈనెల 30న ఫైనల్‌ జరుగనుంది.

ABOUT THE AUTHOR

...view details