ఐటీ గ్రిడ్స్ కేసు దర్యాప్తులో కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
By
Published : Mar 6, 2019, 8:32 PM IST
అసలేం జరిగింది..!
అసలేం జరిగింది..!
డేటా వ్యవహారం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీస్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి , మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకటరాంరెడ్డి సిట్ బృందంలో సభ్యులుగా నియమితులయ్యారు.