ఐదు నెలలైనా చెక్ పవర్ ఇవ్వరా..! - చెక్ పవర్ కోసం సర్పంచ్ల నిరసన
నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో మండలంలో సర్పంచ్లు నిరసనకు దిగారు. తాము గెలిచి ఐదు నెలలు గడుస్తున్నా చెక్ పవర్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![ఐదు నెలలైనా చెక్ పవర్ ఇవ్వరా..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3530668-thumbnail-3x2-vysh.jpg)
నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశం మధ్యలో సర్పంచులు పోడియం ముందు బైఠాయించారు. తాము గెలిచి ఐదు నెలలు అవుతున్నా తమకు చెక్పవర్ ఇవ్వకపోవడం వల్ల గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని నిరసన తెలిపారు. ప్రభుత్వం త్వరగా చెక్ పవర్ కల్పించాలని వారందరు కోరారు. ప్రస్తుత ఎంపీపీ, ఎంపీటీసీల ఐదు సంవత్సరాల కాలం ముగిసినందున వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.