తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'టైగర్​ సిరీస్'​లో మరోసారి సల్మాన్​, కత్రినా!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ తెరపై మరోసారి సందడి చేసే అవకాశం ఉంది. టైగర్ సిరీస్​లోని మూడో చిత్రంలోనూ తాము కలిసి నటిస్తామని సల్లూ భాయ్ తెలిపాడు.

By

Published : Mar 26, 2019, 8:31 PM IST

సల్మాన్ కత్రినా మూడోసారి కలిసి నటించనున్నారు

'ఏక్ థా టైగర్'కు కొనసాగింపుగా వస్తున్న మూడో సినిమాలో సల్మాన్ ఖాన్​ - కత్రినా కైఫ్​ కలిసి నటించబోతున్నట్టు ఊహాగానాలొస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ ఇటీవల సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్​లో పాల్గొన్న సల్మాన్...టైగర్ సిరీస్ నుంచి మరో సినిమా రానుందని సంకేతాలిచ్చాడు. చిత్రబృందం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఈ సినిమాలోనూ కత్రినానే హీరోయిన్​గా నటిస్తుందని తెలిపాడు సల్లూ భాయ్. వీరిద్దరూ ఆన్ స్క్రీన్​పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్​లోనూ అభిమానులను అలరిస్తుంటారు. ప్రస్తుతం 'భారత్​'లో కలిసి నటిస్తున్నారు.

ఏప్రిల్ 24న 'భారత్' ట్రైలర్​ విడుదల కానుంది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకున రానున్న హలీవుడ్ చిత్రం 'అవెంజర్స్:ఎండ్ గేమ్'​తో పాటు దీన్ని ప్రదర్శించనున్నారు.

2017లో వచ్చిన 'టైగర్ జిందా హై'లో వీరిద్దరూ కలిసి నటించారు. బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందీ చిత్రం.


ABOUT THE AUTHOR

...view details