తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మలేసియా ఓపెన్​ నుంచి సైనా ఔట్

మలేసియా ఓపెన్​ తొలి రౌండ్​లోనే భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా ఓడిపోయింది. పీవీ సింధు, శ్రీకాంత్ రెండో రౌండ్​లోకి ప్రవేశించారు.

By

Published : Apr 4, 2019, 8:52 AM IST

మలేసియా ఓపెన్ తొలి రౌండ్​లోనే ఓటమి పాలైన సైనా నెహ్వాల్

మలేసియా ఓపెన్​లో ఇండియా క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్.. తొలి రౌండ్​లోనే ఓటమి పాలైంది. థాయ్​లాండ్​ క్రీడాకారిణి ఖోసిట్ ఫెప్రాదబ్ చేతిలో 22-20,15-21,10-21 తేడాతో ఓడిపోయింది.

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, శ్రీకాంత్ రెండో రౌండ్​లోకి ప్రవేశించారు. జపాన్​కు చెందిన అయా ఒహోరిపై సింధు గెలుపొందగా, ఇండోనేసియా ఆటగాడు మౌలానాపై శ్రీకాంత్ విజయం సాధించాడు.

పురుషుల సింగిల్స్ క్రీడాకారులు హెచ్​.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మ తొలి రౌండ్​లోనే ఓడిపోయారు.

పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్‌ రెడ్డి జంట మొదటి రౌండ్​లోనే ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది.

ABOUT THE AUTHOR

...view details