తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జపాన్​లోనూ సందడి చేయనున్న 'సాహో' - సాహో

ప్రభాస్, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాహో'. భారత్​తో పాటు జపాన్​లోనూ విడుదల కానుంది.

జపాన్​లోనూ విడుదల కానున్న సాహో సినిమా

By

Published : Apr 5, 2019, 6:15 PM IST

ఈ ఏడాది అభిమానులెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో తొలి వరుసలో ఉంది 'సాహో'. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళంలో ఏకకాలంలో దీన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జపాన్​లోనూ సినిమా విడుదల చేయనున్నారు.

ప్రచారంలో భాగంగా త్వరలో జపాన్​లో పర్యటించనుంది చిత్రబృందం. ఇంతకు ముందు అక్కడ విడుదలైన 'బాహుబలి' తెలుగువారికే కాకుండా జపానీయులకు తెగనచ్చేసింది. ఈ కారణంతోనే 'సాహో'ను అక్కడ రిలీజ్​ చేసేందుకు సిద్ధమయ్యారు.

బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటిస్తుంది. నీల్ నితిన్​ ముఖేశ్​ విలన్​గా కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో జాకీ ష్రాఫ్, మందిరా బేడి, అరుణ్ విజయ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. శంకర్-ఎహసన్-లాయ్ సంగీతమందించారు. 'రన్ రాజా రన్' ఫేం సుజీత్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details