తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా - నిరసన

ప్రతిపక్షాల నిరసనల మధ్య మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ వాయిదా పడింది.

మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా

By

Published : Feb 7, 2019, 12:52 PM IST

మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా
పెద్దల సభ విపక్షాల నిరసనలతో హోరెత్తింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, శుక్రవారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సభాపతి వెంకయ్య నాయుడు వివరిస్తుండగానే సమాజ్​వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్​ యాదవ్​ మాట్లాడారు. దాంతో ఆగ్రహించిన ఛైర్మన్​ వెంకయ్య సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను నడపలేనని తేల్చి చెప్పారు. 11:20 గంటల వరకు ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు.

అనంతరం సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్​ విధానంపై సుప్రీం కోర్టులో పునర్విచారణ వ్యాజ్యం​ వేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు. ఆయన ప్రసంగంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. ఎస్పీ, బీఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. ఆ గందరగోళం మధ్యే సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్​.

ABOUT THE AUTHOR

...view details