తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండో రోజు ఈడీ విచారణకు వాద్రా

మంగళవారం 9 గంటల సుధీర్ఘ విచారణ తర్వాత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా బుధవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు.

By

Published : Feb 13, 2019, 5:57 PM IST

ఈడీ కార్యాలయానికి వెళుతున్న రాబర్ట్​ వాద్రా

రాజస్థాన్​లోని బికనేర్​​ జిల్లా భూ కుంభకోణం విషయంలో కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రోజు విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయం భారీ భద్రత నడుమ జైపూర్​లోని ఈడీ జోనల్​ కార్యాలయానికి చేరుకున్నారు.

మంగళవారం వాద్రాతో పాటు హాజరైన ఆయన తల్లి మౌరీన్​ను కొంత సమయం విచారించిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి వెళ్ల్లేందుకు ఆనుమతించారు. రాబర్ట్​ వాద్రాను మాత్రం 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.

కాగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారితో పాటే ఈడీ కార్యాలయానికి వచ్చారు.

మనీ లాండరింగ్​ కేసు విచారణ కోసం ఇదివరకే మూడుసార్లు దిల్లీలోని కార్యాలయంలో వాద్రా హాజరయ్యారు. జైపూర్​లో ఇది రెండవది.

ABOUT THE AUTHOR

...view details