తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2019, 1:32 PM IST

ETV Bharat / briefs

రాకేశ్​రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డికి, స్థానిక పోలీసులకు మధ్య సంబంధాలపై విచారణ ముమ్మరం అయింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులకు ప్రశ్నావళిని ఇచ్చి, సమాధానాలివ్వాలని ఆదేశించారు. హత్యకు సహకరించారనే కోణంలో సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్​ను అరెస్ట్​చేసే అవకాశం ఉంది. సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జయరాం హత్యకేసులో దర్యాప్తు వేగవంతం

జయరాం హత్యకేసులో దర్యాప్తు వేగవంతం
పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డికి సహకరించారనే ఆరోపణలపై సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్​లను అరెస్ట్​చేసే అవకాశం ఉంది. హత్య గురించి వీరికి తెలియనప్పటికీ... జయరాంను రాకేశ్​రెడ్డి ఇంటికి తీసుకెళ్లేందుకు వీరు సహకరించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రాకేశ్​రెడ్డితో లావాదేవీలు కొనసాగించారని, జయరాం హత్య గురించి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని దర్యాప్తులో తేలింది. నేరం గురించి తెలిసినా.. సమాచారమివ్వకపోవడమూ నేరమనే కోణంలో వ్యాపారిని అరెస్ట్​ చేయనున్నారు. ఇప్పటికే రాకేశ్​రెడ్డి, శ్రీనివాస్​, నాగేశ్​, విశాల్​, సూర్యచంద్రారెడ్డిలను రిమాండ్​కు తరలించారు.

హత్య అనంతరం రాకేశ్​రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్​, రాంబాబులకు ఫోన్​చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐలు గోవింద్​రెడ్డి, హరిశ్చంద్రారెడ్డిలు హత్య కేసుపై సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురికి ఇదివరకే ఉన్నతాధికారులు ప్రశ్నావళి ఇచ్చారు. రాకేశ్​రెడ్డితో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది... హత్య జరిగిన తర్వాత రాకేశ్​రెడ్డి ఫోన్​చేశారా... ఫోన్​లో ఏం చెప్పారు వంటి ప్రశ్నలు ఉన్నాయి. వారి సమాధానాలను నిర్ధరించుకుని చర్యలు తీసుకోనున్నారు.
ఇవీ చూడండి:తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ

ABOUT THE AUTHOR

...view details