తెలంగాణ

telangana

నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి

హోలీ వేళ కొందరి ఇంట ఆనందం నిండగా మరికొందరి ఇంట విషాదం నింపింది. వేడుకల్లో పాల్గొని స్నానానికి వెళ్లి రాష్ట్రంలో ఐదుగురు మృత్యవాత పడ్డారు.

By

Published : Mar 22, 2019, 6:16 AM IST

Published : Mar 22, 2019, 6:16 AM IST

Updated : Mar 22, 2019, 7:41 AM IST

నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి

నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్లు.. ఆ నిమిషంలో రంగులు పూసుకొని హోలీ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నవారు... మరు క్షణంలో రంగులు కడుక్కోవడానికి వెళ్లి నీళ్లల్లో పడి మృత్యువాతపడ్డారు.


వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన మాధవన్​ హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నానానికి చెరువుకు వెళ్లి నీళ్లలో మునిగి మరణించారు. మృతదేహాన్ని వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్నేహితులతో హోలీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత స్నానానికి మంజీరా జలాశయానికి వెళ్లి లోతు అంచనా వేయలేక సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి పల్లికి చెందిన తుకారం మృత్యువాత పడ్డారు. ఈయనకు నెలరోజుల కిందటే వివాహం అయ్యింది.

వనపర్తి జిల్లా అమరచింతలో నీళ్లలో పడి ఏడో తరగతి విద్యార్థి రవి మరణించాడు. మేడ్చల్​ జిల్లా కాచిగాని సింగారంలో ఈతకొలనులో పడి రాజస్థాన్​కు చెందిన భగవాన్​బాయ్​ మృతిచెందాడు. కుమురం భీం జిల్లా తటిపల్లి గ్రామం వద్ద ప్రాణహిత నదిలో పడి మహారాష్ట్రకు చెందిన రామగిర్కార్​ మారుతి మరణించారు.

ఇవీ చూడండి:పెళ్లి జరిగి నెల కాలేదు హోలీ నాడు యువకుడు మృతి

Last Updated : Mar 22, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details