తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2020, 4:52 PM IST

ETV Bharat / briefs

పాక్​ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి దాడికి దిగింది. దాయాది దుశ్చర్యలకు భారత్​ దీటుగా సమాధానమిచ్చింది.

Pak Army targets forward posts and villages along LoC in J-K's Poonch
పాక్​ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు

సరిహద్దు వెంబడి పాకిస్థాన్​ సైన్యం మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​... సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. పాక్​ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం.

బాలాకోట్​, మెందార్​ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారత అధికారులు వెల్లడించారు.

కుప్వారా జిల్లాలోని టాంగ్ధర్​ సెక్టార్​లోనూ ఈరోజు తెల్లవారుజామున పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్​ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details