తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పాఠశాలపై బాంబు దాడి, విద్యార్థులకు గాయాలు

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని ఓ పాఠశాలపై టెర్రరిస్టులు బాంబు దాడితో విధ్వంసం సృష్టించారు.

By

Published : Feb 14, 2019, 6:28 AM IST

పాఠశాలపై బాంబు దాడి, విద్యార్థులకు గాయాలు

జమ్ము కశ్మీర్​లోని ఏ పాఠశాలపై బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. పుల్వామా జిల్లా కాకాపోరా సమీపంలోని నార్బల్​ గ్రామంలో జరిగిందీ ఘటన. 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

పాఠశాలపై బాంబు దాడి, విద్యార్థులకు గాయాలు

విద్యార్థులకు వింటర్​ ట్యూషన్లు నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.పాఠశాలపై బాంబు దాడి, విద్యార్థులకు గాయాలు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దాడిని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మలిక్​ గాయపడిన ఒక్కొక్కరికీ రూ. 50 వేల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details