తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పార్లమెంటు ముందుకు 'రఫేల్​' కాగ్​ నివేదిక

రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్నందున కాగ్​ నివేదికను పార్లమెంటుకు సమర్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

By

Published : Feb 11, 2019, 9:49 PM IST

పార్లమెంటు ముందుకు 'రఫేల్​' కాగ్​ నివేదిక

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదికను పార్లమెంటుకు సమర్పించనుంది ప్రభుత్వం. పార్లమెంటు సమావేశాలు బుధవారం ముగుస్తున్నందున మంగళవారమే నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్​ సంస్థ డసోతో కేంద్రం చేసుకున్న ఒప్పందంపై ఏడాది కాలంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. రఫేల్​లో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఆరోపిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ రఫేల్​పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్​ మెహ్రిషి రఫేల్​ ఒప్పంద సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారని, రఫేల్​ ఆడిటింగ్​​ నుంచి ఆయన తప్పుకోవాలని డిమాండ్​ చేశారు.

కాగ్​పై కపిల్​ సిబల్​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ. యూపీఏ పదేళ్ల పాలనలో ఉన్నా, ఆర్థిక శాఖలోని సీనియర్​ కార్యదర్శికే ఆర్థిక శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సిబల్​కు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు.

2014 అక్టోబర్​ 24 నుంచి 2015 ఆగస్టు 30 వరకు రాజీవ్​ మెహ్రిషి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారని సిబల్​ తెలిపారు. అలాగే ఏప్రిల్​ 10, 2015న పారిస్​​ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రఫేల్​ ఒప్పందం చేసుకున్న సమయంలోనూ రాజీవ్​ ఆర్థిక శాక కార్యదర్శిగా ఉన్నట్లు తెలిపారు సిబల్​.

ABOUT THE AUTHOR

...view details