తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నడివీధిలో కాల్పులు-13 మంది మృతి

బ్రెజిల్​లోని రియో డి జెనీరోలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించారు. మృతులంతా మాదకద్రవ్యాల సరఫరాదారుల్ని అధికారులు అనుమానిస్తున్నారు.

By

Published : Feb 9, 2019, 12:40 PM IST

స్మగ్లర్లపై కాల్పులు

మాదకద్రవ్య సరఫరాదారులపై కాల్పులు జరుపుతున్న పోలీసులు
బ్రెజిల్​లోని రియో డి జెనీరోలో పోలీస్​ షూటౌట్​ కలకలం రేపింది. సాంటా థెరిసాలోని ఓ సూపర్​ మార్కెట్​ వద్ద మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానితులపైకి కాల్పులు జరిపారు.

ఘటనా స్థలంలో 11 మంది చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్​లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్​, తుపాకులు, ఆయుధసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రపంచంలోని అత్యంత హింసాత్మక నగరాల్లో ఒకటిగా రియో డి జెనీరో పేరుగాంచింది. ఇక్కడ తరుచుగా డ్రగ్స్​ ముఠాలు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఏటా లక్షమందిలో సుమారు 50 మంది కాల్పుల్లో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details