తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఒడిశా సీఎంగా నవీన్​ పట్నాయక్​ ప్రమాణం - ఒడిశా

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్​ పట్నాయక్​ ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. భువనేశ్వర్​లోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రితో పాటు 21 మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో 10 మంది కొత్తవారు.

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్​ పట్నాయక్​ ప్రమాణం

By

Published : May 29, 2019, 10:56 AM IST

Updated : May 29, 2019, 12:36 PM IST

పట్నాయక్​ ప్రమాణ స్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్​ పట్నాయక్ బుధవారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్​లోని ఎగ్జిబిషన్​ మైదానంలో ప్రమాణ స్వీకార మహోత్సవం లాంఛనంగా జరిగింది. ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులు ప్రమాణం చేశారు. నవీన్​ పట్నాయక్ మంత్రివర్గంలో ఈసారి 10 మంది కొత్తవారికి చోటు లభించింది.

ఈ వేడుకకు ముఖ్యమంత్రి సోదరి, ప్రముఖ రచయిత్ర గీతా మెహ్త, సోదరుడు ప్రేమ్​ పట్నాయక్​ హాజరయ్యారు. 7 వేల మంది ఉన్నతాధికారులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో నవీన్​ పట్నాయక్​ చేత స్వీకారం చేయించారు ఒడిశా గవర్నర్​ గణేశి లాల్​. ఐదోసారి ముఖ్యమంత్రి బాధ్యలు చేపట్టిన పట్నాయక్​ బహిరంగంగా ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి.

బిజూ జనతాదళ్​ రికార్డు...

ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బిజూ జనతాదళ్(బీజేడీ). 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో 112 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2000 సంవత్సరం నుంచి శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించింది బీజేడీ. ఐదోసారి ముఖ్యమంత్రిగా నవీన్​ పట్నాయక్​ బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి: షాపింగ్, యాక్టింగ్​లో ఈ శునకం సూపర్

Last Updated : May 29, 2019, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details