తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర ఘాతుకం.. 42 మంది జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్​ జవాన్లు మృతి చెందారు.

By

Published : Feb 14, 2019, 8:07 PM IST

Updated : Feb 14, 2019, 8:56 PM IST

దాడి ఘటనా ప్రాంతం

జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో ఉగ్రమూకలు మరోసారి ఘాతుకానికి తెగబడ్డాయి. సీఆర్పీఎఫ్​ జవాన్లు వెళుతున్న వాహన శ్రేణిపై ఉగ్రవాదులు శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో40 మంది జవాన్లు చనిపోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతి పెద్దదని అధికారులు తెలిపారు.

ఈ దాడి తామే చేశామని ప్రకటించింది జైషే మహమ్మద్​ ఉగ్రవాద సంస్థ.

సెలవులకు వెళ్లి వస్తూ..విషాదం

సీఆర్పీఎఫ్​ జవాన్లు 78 వాహనాల్లో ప్రయాణిస్తుండగా పేలుడు పదార్థాలతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ వాహనాల్లో మొత్తం 2500 మందికి పైగా జవాన్లు ఉన్నారు. వీరిలో చాలా మంది సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరుకావడానికి వస్తున్నారు. శ్రీనగర్​-జమ్ము జాతీయ రహదారిపై వెళుతున్న జవాన్ల వాహనాలు అవంతిపొరలోని లోటోమోడి ప్రాంతం వద్దకు చేరుకోగానే ఉగ్రవాదులు బాంబులతో నిండిన వారి వాహనాలతో దాడికి తెగబడ్డారు.

దాడి తీరు

జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని బాంబులతో కూడిన వాహనాలతో ఢీకొట్టి ఘాతుకం చేశారు ఉగ్రవాదులు. కాల్పులు కూడా జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

జైషేనే దోషి

కాక్రపరాకు చెందిన అదిలీ అహ్మద్​ బాంబులతో నిండిన వాహనాలను నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఇతను 2018లో జెయిమ్​లో చేరాడు. ఘటనకు తామే బాధ్యులమని జైషే మొహమ్మద్​ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

పూర్తిగా ధ్వంసమైన బస్సు

పేలుడు పదార్థాల వల్ల జవాన్లు ఉన్న ఓ వాహనం పూర్తిగా ధ్వంసమై శకలాలు చెల్లాచెదురైపోయాయి. జవాన్ల శరీరాలు, బస్సు తునాతునకలయ్యాయి. వాహణశ్రేణిలోని పలు బస్సులు దెబ్బతిన్నాయి.

" ఇది చాలా పెద్ద వాహన శ్రేణి, సుమారు 2500 మంది జవాన్లు వీటిలో ప్రయాణిస్తున్నారు. పేలుళ్లతో పాటు వాహానాలపై ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు సమాచారముంది. " - భట్​నగర్​, సీఆర్పీఎఫ్​ డీజీ

సాయాంత్రానికల్లా గమ్యం చేరాలి

జమ్ము నుండి ప్రారంభమైన ఈ వాహన శ్రేణి సుర్యాస్తమయ సమయానికల్లా శ్రీనగర్​ చేరాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రహదారిపై గత రెండు,మూడు రోజులుగా రద్దీ తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది ఉగ్రమూకలకు అనుకూమైందని అధికారులు తెలిపారు.

ఈసారే ఎక్కువ మంది

ప్రతి సారి వాహన శ్రేణిలో 1000 మంది జవాన్లు మాత్రమే ప్రయాణించే వారని , కానీ ఈ సారి 2547 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

విచారణ జరుగుతోంది...

తీవ్రవాదులను వేటాడానికి గస్తీ బృందాలను పంపామని , వారు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్​ బృందాలు దాడి జరిగిన ప్రాంతాంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడు గురైన బస్సులో 76వ బెటాలియన్​కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్నారు..

Last Updated : Feb 14, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details