దేశద్రోహం కేసులో తనకు మరణశిక్ష విధించడంపై తొలిసారి స్పందించారు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. వ్యక్తగత కక్షతోనే తనకు ఈ శిక్ష పడేలా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ముషారఫ్ పార్టీ వీడియో విడుదల చేసింది. న్యాయస్థానంలో తాను గానీ, తన తరఫు న్యాయవాదివి గానీ వాదనలు వినకుండా శిక్ష ఖరారు చేశారని ముషారఫ్ చెప్పారు. ఇలా జరిగిన సందర్భాలు గతంలో లేవన్నారు. రాజ్యాంగబద్ధంగా ఈ కేసు విచారణ జరపాల్సిన అవసరం లేదని.. కొంతమంది కావాలనే తనకు శిక్షపడేలా చేశారని ఆరోపించారు పాక్ మాజీ సైన్యాధిపతి.
వ్యక్తిగత కక్షతోనే మరణ శిక్ష: ముషారఫ్ - musharaf death penalty news
వ్యక్తిగత కక్షతోనే దేశద్రోహం కేసులో తనకు మరణశిక్ష విధించారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ఆయనకు మద్దతుగా పాక్లోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.
![వ్యక్తిగత కక్షతోనే మరణ శిక్ష: ముషారఫ్ Musharraf](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5421365-thumbnail-3x2-img.jpg)
వ్యక్తిగత కక్షతోనే ఉరిశిక్ష
ముషారఫ్కు పాక్లోని ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు మద్దతుగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు ఆ దేశ ప్రజలు.
ఇదీ చూడండి: ఫొటోలు తీసినందుకు నెలకు రూ.26 లక్షల జీతం
Last Updated : Dec 19, 2019, 11:36 AM IST