తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అంతరిక్షంలోనూ భారత్​కు చౌకీదార్​: మోదీ - odisha

'మిషన్​ శక్తి'ని తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రధాని నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. కేవలం నినాదాలు చేసిన వారిని కాక... ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఒడిశాలోని కోరాపుట్​లో జరిగిన సభలో మోదీ ప్రసంగం

By

Published : Mar 29, 2019, 12:21 PM IST

Updated : Mar 29, 2019, 4:38 PM IST

ఒడిశాలోని కోరాపుట్​లో జరిగిన సభలో మోదీ ప్రసంగం
ఒడిశా అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ ఎన్డీఏ ప్రభుత్వం విడిచిపెట్టలేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు.రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందని వివరించారు.

లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే ఒడిశాలో భాజపా విజయమే లక్ష్యంగా ప్రచార శంఖారావం పూరించారు మోదీ. కోరాపుట్​ జిల్లా జయపురలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని​ పరీక్షించేందుకు ఇటీవల నిర్వహించిన మిషన్​ శక్తిని ప్రస్తావిస్తూ విపక్షాలపై దుమ్మెత్తిపోశారు మోదీ.

"ఒడిశా ఒక చారిత్రాక విజయానికి కేంద్రమైంది. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పింది. భారత్​కు అంతరిక్షంలోనూ కాపాలాను నిర్వహించ గల సత్తా ఉంది. ఈ ఘనతను కొంత మంది చిన్న చూపు చూస్తున్నారు. వారిని దేశమంతా గమనిస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల విషయంలో విపక్షాల తీరును మోదీ తప్పుబట్టారు.

"బాలాకోట్ వైమానిక దాడులకు నెలరోజులు పూర్తయింది. ఉగ్రవాదుల శవాలను లెక్కించే పనిలోనే పాకిస్థాన్​ ఉంది. ప్రతిపక్షాలు మాత్రం ఆధారాలు అడుగుతున్నాయి. ఒక స్పష్టమైన ఆలోచనతో పోలింగ్ బూత్​​కు వెళ్లండి. ఉగ్రవాదులను ఇంట్లోకి చొరబడి శిక్షించే ప్రభుత్వం కావాలో, మాటలతో చేతులు దులిపేసుకునే ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలి"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Last Updated : Mar 29, 2019, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details