తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎంఎన్​జేలో కేన్సర్​ బ్లాక్​ నిర్మాణానికి శంకుస్థాపన

నిరుపేదలకు మరింత మైరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఎంఎన్​జే కేన్సర్​ ఆస్పత్రిలో నూతన బ్లాక్​కు శంకుస్థాపన చేశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బోన్​ మ్యారో సహా వివిధ రకాల సేవలతో ఈ బ్లాక్​ అందుబాటులోకి రానుందని తెలిపారు.

By

Published : Jun 14, 2019, 12:45 PM IST

ఎంఎన్​జే ఆస్పత్రిలో కేన్సర్​ బ్లాక్​ నిర్మాణానికి శంకుస్థాపన

ఎంఎన్​జే ఆస్పత్రిలో కేన్సర్​ బ్లాక్​ నిర్మాణానికి శంకుస్థాపన

ఎంఎన్​జే ఆస్పత్రిలో నూతనంగా నిర్మించనున్న కేన్సర్​ బ్లాక్​కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ శంకుస్థాపన చేశారు. రెడ్​హిల్స్​లోని నిలోఫర్​ స్కూల్​ ఆఫ్​ ఎడ్యుకేషన్​ పరిసరాల్లో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ భవనాన్ని 40 కోట్ల వ్యయంతో అరబిందో ఫార్మా యాజమాన్యం నిర్మించనుందని వెల్లడించారు. దాదాపు 200 పడకల సౌకర్యంతో ఈ బ్లాక్​ అందుబాటులోకి రానుంది. బీడీఎల్​ ఇండియా సంస్థ ఎంఎన్​జేకు అందిస్తున్న వైద్య పరికరాలను మంత్రి ఈటల పరిశీలించారు. బోధనాసుపత్రిలో ప్రొఫెసర్​ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచినట్లు ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details