తెలంగాణ

telangana

By

Published : May 30, 2019, 7:09 AM IST

ETV Bharat / briefs

త్వరలో మోదీ, జిన్​ పింగ్​ భేటీ...

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​తో సమావేశం కానున్నారు. ఈ భేటీ జరిగే వేదిక, అధికారిక తేదీ నిర్ణయించాల్సి ఉందని విదేశీ వ్యవహారాల కార్యాలయం తెలిపింది.

త్వరలో మోదీ, జిన్​ పింగ్​ భేటీ...

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో ఇష్టాగోష్ఠిలో పాల్గొననున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో జరగబోయే ఈ సమావేశానికి సంబంధించి అధికారికంగా తేదీ, వేదిక ఇంకా నిర్ణయించలేదని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఇరు దేశాలు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.

గతేడాది చైనాలోని వుహాన్​లో మోదీ, జిన్​పింగ్​ మొదటిసారి ఇష్టాగోష్ఠి శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అప్పటికీ డోక్లాం వివాదం తలెత్తి కొద్ది నెలలే అయింది. సరిహద్దులో పరస్పరం సహకారం అందించుకోవాలని అప్పట్లో ఇరు దేశాల బలగాలకు సూచించారు మోదీ, జిన్​పింగ్​. 2019లో మరోసారి సమావేశం అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​పై నేరం మోపలేం: ముల్లర్​​

ABOUT THE AUTHOR

...view details