తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఫెడరల్​ ఫ్రంట్​ - kodandaram-1-1

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇప్పటికీ విడుదల కాలేదు. ఇంటర్‌ జవాబుపత్రాల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే పట్టించుకోకుండా... ఫెడరల్​ ఫ్రంట్​ అంటూ... ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రాలు తిరగటం సరైనది కాదు : తెజస అధినేత కోదండరాం.

సమస్యలపై​ దృష్టి పెట్టండి

By

Published : May 10, 2019, 4:38 PM IST

Updated : May 10, 2019, 4:49 PM IST

రాష్ట్రంలోని సమస్యల నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఫెడరల్​ ఫ్రంట్ పేరుతో తిరుగుతున్నారని తెజస అధ్యక్షుడు​ ఆచార్య కోదండరామ్​ అభిప్రాయపడ్డారు. సమాఖ్య కూటమి అనేది సాధ్యం కాదని... నిలదొక్కుకోలేదని తెలిపారు. దిల్లీలో ఇప్పటికే ఒక సమూహం ఏర్పడిందని... ఓట్ల లెక్కింపు తర్వాత మహా ఘట్​బంధన్​ క్రియాశీల పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్​ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కోదండరామ్​ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై సీఎం కేసీఆర్​ దృష్టి పెట్టాలని హితవు పలికారు. హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద తెజస, సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

సమస్యలపై​ దృష్టి పెట్టండి
Last Updated : May 10, 2019, 4:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details