తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఫిబ్రవరి 24న కిసాన్​ సమ్మాన్ నిధి ప్రారంభం ... - కిసాన్ నిధి రంభం

రైతులకు పెట్టుబడి సాయానికి ఉద్దేశించిన పథకం 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి'ని ఈనెల 24న ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ప్రారంభించనున్నారు.

కిసాన్​ సమ్మాన్ నిధి

By

Published : Feb 14, 2019, 7:07 AM IST

Updated : Feb 14, 2019, 9:43 AM IST

ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయానికై ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​నిధి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ఈ నెల 24నే ప్రారంభించనున్నారు. ఫర్టిలైజర్​ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 'కిసాన్ మహా అధివేశన్'​గా నామకరణం చేశారు.

తొలివిడత సాయంగా రూ. 2 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు భాజపా రాష్ట్రాధ్యక్షుడు సత్యేంద్ర సిన్హా. ఏడువేలమంది రైతులు ఈ సభలో పాల్గొననున్నారని అంచనా.

ప్రతిపక్ష నాయకుల ఎద్దేవా...

2016లో ఫర్టిలైజర్ మైదానం లోనే ఎయిమ్స్​కు, ఫర్టిలైజర్​ ఫాక్టరీకి శంకుస్థాపన చేశారని ఇప్పటి వరకూ నిర్మాణానికి నోచుకోలేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ప్రస్తుతం పెట్టుబడి సాయానికి నాంది పలుకుతున్నారని ఈ పథకాన్ని అలాగే మట్టిపాలు చేస్తారని సమాజ్​వాదీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Last Updated : Feb 14, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details