తెలంగాణ

telangana

ETV Bharat / briefs

డోప్ పరీక్షల్లో ఖేలో ఇండియా క్రీడాకారులు విఫలం - ఖేలో ఇండియా క్రీడాకారులు

భారత అథ్లెట్లు మరోసారి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొన్న తొమ్మిది మంది క్రీడాకారులు డోప్ టెస్టుల్లో విఫలమయ్యారు.

డోప్ పరీక్షల్లో విఫలమైన ఖేలో ఇండియా క్రీడాకారులు

By

Published : Mar 21, 2019, 11:54 AM IST

పతకాలు సాధించేందుకు అడ్డదారిని ఎంచుకుంటున్నారు క్రీడాకారులు. నిషేధిత మాదక ద్రవ్యాల్ని తీసుకుని డోప్ పరీక్షల్లో విఫలం అవుతున్నారు.

జనవరిలో రెండో విడత ఖేలో ఇండియా పోటీలు జరిగాయి. అందులో పాల్గొన్న సూమారు 476 మంది శాంపిల్స్​ను సేకరించి పరీక్షలు నిర్వహించింది నాడా(జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ). అందులో పలు క్రీడ్లలో పాల్గొన్న 9 మంది క్రీడాకారులు డోప్ పరీక్షల్లో విఫలమయ్యారు.

టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్న క్రీడాకారులు

అర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్​లలో 9 మంది క్రీడాకారుల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ స్థాయిలు పెరగాయి. ఇందుకోసం నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారు. వారిలో ఎక్కువ మంది రెజ్లింగ్ ఆడిన వారే కావడం విచారకరం.

ABOUT THE AUTHOR

...view details