తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాంగ్రెస్ హయాంలో దళారీలేని రక్షణ ఒప్పందం లేదు:మోదీ

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశ భద్రతపై ఎప్పడూ దృష్టి సారించలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కాంగ్రెస్​ పాలన మొత్తం దళారీలతోనే నడిచిందని ఎద్దేవా చేశారు. తమిళనాడులోని బహిరంగసభలో కాంగ్రెస్​పై ఘాటు విమర్శలు చేశారు.

By

Published : Feb 10, 2019, 7:33 PM IST

కాంగ్రెస్ హయాంలో రక్షణ ఒప్పందాల తీరుపై మోదీ

కాంగ్రెస్ హయాంలో రక్షణ ఒప్పందాల తీరుపై మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు తిరుపూర్​లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెరుమనల్లూరులో భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 'వణక్కం' అంటూ తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ.

దేశ ప్రజల జీవనవిధానాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.

దేశంలో మార్మోగిపోతున్న నినాదం "నమో అగైన్"కు సంబంధించిన టీ షర్టులు ,హుడీలు తిరుపూర్​లోనే తయారవుతున్నాయని గుర్తు చేశారు ప్రధాని.

కాంగ్రెస్​పై తీవ్ర ఆరోపణలు

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ దేశ భద్రతపై ఎప్పడూ దృష్టి సారించలేదని మోదీ విమర్శించారు. యూపీఏ హయాంలో జరిగిన దేశ భద్రతా ఒప్పందాలు అవినీతి మయమని ఆరోపించారు. వారి సన్నిహితులకు లబ్ధి చేకూర్చడానికే ఒప్పందాలు జరిపారని విమర్శించారు ప్రధాని.

రెండు రక్షణ కారిడార్​లను ఏర్పాటు చేసి సరికొత్త విధానానికి తమ ప్రభుత్వం నాంది పలికిందని మోదీ తెలిపారు. రెండో కారిడార్​ తమిళనాడులోనే ఉందని గుర్తు చేశారు.

" గత ప్రభుత్వాలతో పోల్చితే ఎన్డీఏ పనితీరు విభిన్నం.. రక్షణ, దేశ భద్రత విషయాల గురించి మాట్లాడుకుందాం. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్​ దేశ భద్రత గరించి ఎప్పుడూ ఆలోచించలేదు. వారికి రక్షణ విభాగం అంటే ఒప్పందాల్లో మధ్యవర్తులుగా ఉండటం.. సన్నిహితులకు లాభం చేకూర్చడం..రక్షణ విభాగంలో కాంగ్రెస్​ ప్రభుత్వానికి సముద్రం నుంచి ఆకాశం వరకు చాలా కుంభకోణాలతో సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే వారు రక్షణ విభాగాన్ని ఆధనికీకరణకు నోచుకోనివ్వలేదు. భద్రతా ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం వహించి ఆరెస్టు అయిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్​ నేతలతో ఎందుకు సంబంధాలన్నాయి. "
-నరేంద్ర మోదీ, ప్రధాని

ABOUT THE AUTHOR

...view details