తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2019, 6:45 AM IST

ETV Bharat / briefs

దంతెవాడ ఘటన తర్వాత ఇదే....

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో రెండో అత్యంత దారుణమైన ఘటన. 2010లో మావోయిస్టులు 76 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బందిని బలి తీసుకున్నారు

దంతెవాడ ఘటన తర్వాత ఇదే....

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో యావత్​ భారతదేశం ఉలిక్కిపడింది. అత్యంత భయంకరమైన ఘటనల్లో ఇదొకటిగా పేర్కొంటున్నారు. ఈ ఉగ్రదాడిలో సుమారు 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

2010లో ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సిబ్బంది మరణించారు. ఇప్పటివరకు భారత్​లో ఇదే అత్యంత విషాదకర ఘటన. భారతదేశ చరిత్రలో జరిగిన ఉగ్రదాడుల గురించి ఒకసారి పరిశీలిద్దాం...

  • 2001లో కశ్మీర్​ అసెంబ్లీ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. సుమోలో పేలుడు పదార్థాలతో వచ్చిన ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2015 మార్చి 20న ఆర్మీ దుస్తులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు కతువా పోలీస్​ స్టేషన్​పై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది మరణించారు.
  • 2017 డిసెంబర్​ 31న జైష్​ ఏ మహమ్మద్​ ఉగ్రవాదులు జరిపిన దాడిలోనే ఐదుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు.
  • 2016 జూన్​లో లేత్​పోరాకు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు అమరులయ్యారు.
  • అదే ఏడాది జరిపిన దాడిలో ఫిబ్రవరిలో ముగ్గురు సైనికులు సహా 9 మంది మరణించారు.
  • 2016 సెప్టెంబర్​లో ఉరీలోని సైనిక స్థావరంపై 18 మంది జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగానే భారత్​ మెరుపు దాడులు నిర్వహించింది.
  • 2010లో ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు 76 మంది సీఆర్​పీఎఫ్​ బలగాలను బలి తీసుకున్నారు. ఇప్పటివరకు భారత్​లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.
  • తర్వాత ఏడేళ్లకు సుక్మాలో జరిపిన మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా మరణించారు.

ABOUT THE AUTHOR

...view details