తెలంగాణ

telangana

అవినీతి అధికారి ఆస్తి రూ.225 కోట్లు జప్తు!

By

Published : Mar 21, 2019, 1:01 AM IST

ఉత్తరప్రదేశ్​ మాజీ ఐఏఎస్ అధికారి నేత్​రామ్​కు చెందిన రూ.225 కోట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. ఐటీ చట్టంలోని 132(9బీ) సెక్షన్​ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆదాయపన్నుశాఖ

ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి నేత్‌రామ్‌కు చెందిన రూ.225 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు జప్తు చేశారు. దిల్లీ, ముంబై, నొయిడా, కోల్​కతాల్లోని స్థిరాస్తులు, మూడు విలాసవంతమైన కార్లు జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మార్చి 13న ఐటీ సోదాలు

ఈ నెల 13న ఉత్తరప్రదేశ్​లో నేత్​రామ్​కు చెందిన ఆస్తులపై 12 చోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు చేసింది. నేత్​రామ్​ రూ.300 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన మౌంట్‌ బ్లాంక్‌ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు. రూ.95 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపిన 30 డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ నల్లధనంతో దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో నేత్​రామ్​ ఆరు విలాసవంతమైన ఇళ్లు కొన్నట్లు ఇదివరకే ఐటీ శాఖ ప్రకటించింది.

1979 బ్యాచ్‌కు చెందిన నేత్‌రామ్‌ 2002-03 మధ్య అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి వద్ద కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీకే చెందిన ఓ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఐటీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details