తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2019, 10:25 PM IST

ETV Bharat / briefs

ఆమె భద్రతే ప్రధానం...

ఆమె భద్రంగా ఉంటేనే ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ఇల్లు సురక్షితంగా ఉంటేనే సమాజం, రాష్ట్రం క్షేమంగా ఉంటాయి అనేది తెలంగాణ పోలీస్ విధానం. అందుకే మహిళల భద్రతను ప్రధాన అంశంగా పరిగణిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయి : డీజీపీ

రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో 10కె, 5కె, 2కె పరుగు : డీజీపీ
రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో షీ-టీమ్స్‌ బృందాల ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించనున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ కితాబిచ్చారు. షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details