తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కోటి రూపాయల గుట్కా స్వాధీనం

భారీగా నిషేధిత గుట్కా, సిగరెట్లు సరఫరా చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్​వోటీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వీటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

By

Published : Mar 15, 2019, 7:27 PM IST

భారీగా గుట్కా స్వాధీనం

భారీగా గుట్కా స్వాధీనం
కర్ణాటక నుంచి తెలంగాణకు భారీగా నిషేధిత గుట్కా, సిగరెట్లు సరఫరా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే సామాగ్రితో పాటు రెండు ఆటోలు, లారీ స్వాధీనం చేసుకున్నారు.

ఇబ్రహీంపట్నంలో గోదాం

బీదర్‌కు చెందిన మరీనో జార్జ్ మరో ఐదుగురు కలిసి ఇబ్రహీంపట్నంలో గోదాం అద్దెకు తీసుకుని పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా, సిగరెట్లు నిల్వ చేసి ఉంచారు. అక్కడ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి ముఠాను అరెస్టు చేశారు.

ఈ బృందానికి చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని... వారి కోసం గాలిస్తున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్​ భగవత్‌ తెలిపారు.

ఇవీ చూడండి:తెరాస దోపిడీపై పోరాటం: నాగం

ABOUT THE AUTHOR

...view details