శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఇంట్లో సోదాలు జరిగాయి. దాదాపు 25 మంది పోలీసులు గచ్చిబౌలి మసీద్ బండలోని నివాసానికి చేరుకున్నారు. తనను బెదిరించి... చరవాణి, ఇంటి తాళాలు లాక్కొన్నారని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. ఇంట్లోకి ప్రవేశించాక సీసీ కెమెరా వైర్లు తెంచి సోదాలు చేశారని తెలిపారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎవరూ లేనప్పుడు తనిఖీలు ఏంటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఇంట్లో సోదాలు - హైదరాబాద్
తనిఖీల పేరుతో హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత భిక్షపతి ఇంటివద్ద పోలీసులు హడావుడి చేశారు. 25 మంది పోలీసులు వచ్చి తనను బెదిరించి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఇంట్లో తనిఖీలు