ముఖ్యమంత్రికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.... మార్చి 17న కరీంనగర్ సభలో గులాబీ అధినేత... మతపరమైన వ్యాఖ్యాలు చేశారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎల్లుండి సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. స్టార్ కంపెయినర్ తెరాస అధ్యక్షుడి పేరుతో నోటీసులు పంపింది.
సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు - notices
కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుతో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
![సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2959076-thumbnail-3x2-kcr.jpg)
సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు