తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆజంఖాన్​పై రెండు రోజుల ప్రచార నిషేధం​

మత విద్వేషపూరిత ప్రసంగాలు, జిల్లా ఎన్నికల యంత్రాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సమాజ్​వాదీ పార్టీ నేత ఆజం​ఖాన్​పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా 48గంటల నిషేధం విధించింది.

By

Published : Apr 30, 2019, 11:09 PM IST

ఆజంఖాన్​పై రెండు రోజుల ప్రచార నిషేధం​

రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా సమాజ్​వాదీ పార్టీ నేత ఆజంఖాన్​పై​ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్​లోని స్థానిక ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

ఆజం​ఖాన్​పై ఈసీ ప్రచార నిషేధం విధించడం ఇది రెండోసారి. భాజపా ఎంపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం మొదటిసారి ఆయన ప్రచారంపై 72 గంటల నిషేధం విధించింది.

తాజాగా మరోసారి రెండు రోజులపాటు నిషేధం విధించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రజలను బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలతో ఆజంఖాన్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. అయితే ఆయన జిల్లా ఎన్నికల యంత్రాంగంపై ఎక్కడ విమర్శలు చేశారో మాత్రం ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

తాజా నిషేధం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 48గంట పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించడం, మీడియాకు ప్రకటనలు ఇవ్వకూడదు.

2014లోనూ..

ఆజం​ఖాన్ 2014 లోక్​సభ ఎన్నికల ప్రచారంలోనూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఈసీ నుంచి నిషేధం ఎదుర్కొన్నారు. ఎన్నికల సంఘానికి క్షమాపణలూ చెప్పారు. ఆజం​ఖాన్​ వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తు​లో ఇలాంటి దుష్ప్రవర్తన పునరావృతం కాకూడదని హెచ్చరించింది. అయినా ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆజం​ఖాన్​ ఉత్తరప్రదేశ్​లోని రామ్​పూర్​ లోక్​సభ స్థానం నుంచి సమాజ్​వాదీ పార్టీ తరపున పోటీచేస్తున్నారు.

ఇదీ చూడండి:స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా విక్కీ

ABOUT THE AUTHOR

...view details