తెలంగాణ

telangana

ETV Bharat / briefs

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి - విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి వద్ద విద్యాదాఘాతంతో హమన్​మీరాపూర్​కు చెందిన లారీ డ్రైవర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే యాదాగౌడ్ మృతికి కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

By

Published : May 19, 2019, 11:41 AM IST

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి సమీపంలో విద్యుదాఘాతంతో ఓ లారీ డ్రైవర్​ మరణించాడు. దుబ్బాక మండలం హమన్​మీరాపూర్​ గ్రామానికి చెందిన యాదాగౌడ్​... ఓ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్​ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. శనివారం రావురూకుల నుంచి చిన్నగుండవెళ్లి వెళ్లే మార్గమధ్యంలో రహదారి పనుల కోసం ట్యాంకర్​లోకి నీటిని నింపాడు. అనంతరం ట్యాంకర్​ను వెనక్కి తిప్పే ప్రయత్నంలో వాహనం 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి టైర్లు అంటుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్​కు విద్యుత్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

యాదాగౌడ్​ మృతికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించారు. ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ప్రశాంతంగా 'సార్వత్రికం' తుది దశ పోలింగ్

ABOUT THE AUTHOR

...view details