ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరోమారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆమె మరో దఫా ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది.
రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు! - నేడు నిర్మలా సీతారామన్ ప్రెస్మీట్
'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మరిన్ని ఉద్దీపనలు ప్రకటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆమె మీడియా సమావేశం జరగనుంది.
![రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు! Finance Minister Nirmala Sitharaman will address a press conference today at 4 PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7191355-thumbnail-3x2-nirmala.jpg)
నిర్మల 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!
తొలి రోజు... ఎమ్ఎస్ఎమ్ఈలు, డిస్కంలు, గుత్తేదారులు, డెవలపర్స్కు సంబంధించి ఆరు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్... నేడు మరిన్ని రంగాలకు చేయూతనిచ్చే ప్రకటనలు చేస్తారని ప్రజలు వేచిచూస్తున్నారు.
Last Updated : May 14, 2020, 11:23 AM IST