తెలంగాణ

telangana

ETV Bharat / briefs

శ్యామప్రసాద్​ ముఖర్జీకి భాజపా నేతల నివాళి

జనసంఘ్​ స్థాపకుడు శ్యామప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​ను నిర్వహించారు.

By

Published : Jun 23, 2019, 1:08 PM IST

భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​

శ్యామ ప్రసాద్​ ముఖర్జీ సిద్దాంతం, విలువల కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్​ దివస్​ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ అస్థిత్వం కోసమే ముఖర్జీ వర్ధంతిని నిర్వహిస్తున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు.

జాతీయ వాదాన్ని బలపరిచేందుకు, దేశం అభివృద్ధి చెందేందుకు మరో పార్టీ అవసరమని భావించి జన సంఘను స్థాపించిన గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్​ ముఖర్జీ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తెలిపారు.

భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​

ఇవీ చూడండి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్​ దివస్​ '

ABOUT THE AUTHOR

...view details