తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గుజరాత్​ నుంచి దిశ మార్చుకున్న 'వాయు'

కొన్ని రోజులుగా 'వాయు' తుపాను హెచ్చరికలతో భయపడుతున్న గుజరాత్ ​వాసులకు కొంత ఊరట లభించింది. తుపాను దిశ మారిందని, రాష్ట్రంలో తీరం దాటదని వాతావరణశాఖ ప్రకటించింది.

By

Published : Jun 13, 2019, 10:36 AM IST

Updated : Jun 13, 2019, 11:00 AM IST

గుజరాత్​ నుంచి దిశ మార్చుకున్న 'వాయు'

దిశ మార్చుకున్న 'వాయు'

'వాయు' తుపాను గుజరాత్​ తీరాన్ని తాకదని వాతావరణశాఖ ప్రకటించింది. తుపాను దిశ మారి... పశ్చిమం వైపు ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. కానీ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి గంటకు 160 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

తొలుత 'వాయు' తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్​లోని వెరావల్​, ద్వారక మధ్య తీరాన్ని దాటనుందని భావించారు. కానీ ఇప్పుడు గుజరాత్​ తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోందని వెల్లడించింది వాతావరణ శాఖ.

తుపాను దృష్ట్యా గుజరాత్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇదీ చూడండి:- WC19: వరల్డ్​కప్ గెలిచేది.. వరుణుడంటా..!

Last Updated : Jun 13, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details