తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2020, 5:47 PM IST

ETV Bharat / briefs

హైదరాబాద్ భవన్​లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్...

కరోనా వైరస్ ఏ శాఖలను వదలట్లేదు. పోలీసు, వైద్య, పారిశుద్ధ్య విభాగాలను వదలని కరోనా... ఇప్పుడు రైల్వే శాఖను పలకరించింది. హైదరాబాద్ భవన్ లోని పరిపాలన విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Corona positive to hyderabad bhavan employee
Corona positive to hyderabad bhavan employee

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ భవన్​లోని పరిపాలన విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు వాడుతున్నప్పటికీ... హైదరాబాద్ భవన్​లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ రావడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

ఈ వార్తతో... హైదరాబాద్ భవన్​ను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరిగి సోమవారం నుంచి హైదరాబాద్ భవన్ లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details