ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ రాష్ట్ర సీఎం ఫడణవీస్ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ముంబయి వెళ్లిన కేసీఆర్... ఆ వేడుకకు విద్యాసాగర్ను కూడా ఆహ్వానించారు. ఈ నెల 21న జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫడణవీస్తోపాటు ఏపీ సీఎం జగన్ను స్వయంగా వెళ్లి పిలవాలని కేసీఆర్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర గవర్నర్ను కలిసిన సీఎం కేసీఆర్
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ను ఆహ్వానించేందుకు ముంబయి వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రారంభ వేడుకకు హాజరుకావాలంటూ కోరారు.
cm kcr meets maharashtra governor vidyasagar rao