తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీబీఐ వివాదంలోకి నాగేశ్వరరావు సతీమణి

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, పశ్చిమ్ బంగా పోలీసుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. సీబీఐ పూర్వ తాత్కాలిక సంచాలకుడు నాగేశ్వర రావు సతీమణికి చెందిన సంస్థలపై కోల్​కతా పోలీసుల దాడులే ఇందుకు నిదర్శనం.

By

Published : Feb 9, 2019, 6:25 AM IST

Updated : Feb 9, 2019, 12:05 PM IST

సీబీఐ

సీబీఐ వివాదంలోకి నాగేశ్వరరావు భార్య
కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రస్తుతం అదనపు సంచాలకుడు అడిషనల్​ డైరెక్టర్​, మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర రావు సతీమణి మన్నెం సంధ్య మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయనే ఆరోపణలతో... రెండు ఆర్థిక సంస్థలపై కోల్​కతా పోలీసులు దాడులు చేశారు. పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను సీబీఐ ప్రశ్నించే ఒక రోజు ముందు ఈ పరిణామం జరగటం విశేషం.

బౌబజార్​ పోలీసు స్టేషన్​లో దాఖలైన పాత ఫిర్యాదు మేరకు దాదాపు 30 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలకు, సంధ్యకు మధ్య తరచుగా లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు.

తమ కుటుంబీకులకు ఆ సంస్థలతో సంబంధాలు లేవని నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ వివాదంపై 30 అక్టోబర్​ 2018 నాడే పత్రిక ప్రకటన ఇచ్చానని ఆయన అన్నారు. ఈ సంస్థల యజమానులను శనివారం నాడు కోల్​కతా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 9, 2019, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details