తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'జీ' గొడవ: రాహుల్​ గాంధీపై కేసు

కాంగ్రెస్​ ఆధ్యక్షుడు రాహుల్​ గాంధీపై ఉత్తరప్రదేశ్​లోని బదాయూ​ కోర్టులో న్యాయవాదులు పిటిషన్​ దాఖలు చేశారు. ​జైషే ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్​ అజార్​ను గౌరవ వచనంతో సంబోధించినందుకు కేసు పెట్టారు.

By

Published : Mar 16, 2019, 8:29 PM IST

రాహుల్​ గాంధీపై కేసు

కాంగ్రెస్​ ఆధ్యక్షుడు రాహుల్​ గాంధీపై ఉత్తరప్రదేశ్​లోని బదాయూ​లో కేసు నమోదైంది. జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్​ అజార్​ను గౌరవంగా సంబోధించినందుకు ఆయనపై జిల్లా కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు న్యాయవాదులు.

"పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది జవాన్ల మృతికి 'మసూద్​ అజార్​ జీ' బాధ్యత వహించాలి"

-దిల్లీలో కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో రాహుల్​ వ్యాఖ్యలు

" పార్లమెంట్​ సభ్యుడు, కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడైన రాహుల్​ గాంధీ మసూద్​పై చేసిన వ్యాఖ్యలను దేశమంతా విన్నది. ఉగ్రవాదుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం అంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాహుల్​ వ్యాఖ్యలపై సీజేఎం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశా. మార్చి 23న కోర్టు ఈ కేసును విచారించనుంది."
-దివాకర్​ వర్మ, న్యాయవాది

ABOUT THE AUTHOR

...view details