తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బంగాల్​ వైపే మోదీ చూపు - ఛత్తీస్​గఢ్

పశ్చిమ్​ బంగాలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈ వారం బెంగాల్​కు ఆయన రావడం రెండోసారి. అలాగే ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​ సభలోనూ పాల్గొననున్నారు మోదీ.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

By

Published : Feb 8, 2019, 6:48 AM IST

Updated : Feb 8, 2019, 7:52 AM IST

పశ్చిమ్​ బంగ, ఛత్తీస్​గఢ్​లో మోదీ బహిరంగ సభలు
లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరం చేశారు. పశ్చిమ్​ బంగాలో నేడు భాజపా బహిరంగ సభకు హాజరుకానున్నారు. తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.

సత్యాగ్రహం ముగిసిన మూడు రోజులకే...

మమత సత్యాగ్రహ దీక్షను ముగించిన మూడు రోజులకే మోదీ పశ్చిమ్​ బంగ​కు వస్తున్నారు. ఈ వారంలో మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.

భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న 23 పార్టీలు తమ భారాన్నంతా మమతపైనే పెట్టారు. 46 గంటలపాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు ఆ పార్టీలన్నీ దీదీకి పూర్తి మద్దతు ప్రకటించాయి.

ఎదురుదాడి ప్రయత్నాల్లో ప్రధాని

పార్టీతో పాటు ప్రధాని పదవికి పోటీగా నిలుస్తున్న మమతకు చెక్​ పెట్టేందుకు మోదీ వ్యూహాలు పన్నుతున్నారు. పశ్చిమ్​ బంగలో పర్యటనల జోరు పెంచారు. దీదీ చేస్తున్న ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చేందుకు బంగ్లాదేశ్​ సరిహద్దు జిల్లా జల్​పాయీగుఢీని ఎంచుకున్నారు. ముఖ్యంగా మమత దీక్షపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఛత్తీస్​గఢ్​లోనూ...

ఛత్తీస్​గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ రాష్ట్రంలో ప్రధాని తొలిసారి పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు రాయ్​గఢ్​ జిల్లాలోని బహిరంగ సభకు మోదీ హాజరవుతారు.

Last Updated : Feb 8, 2019, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details