బిహార్ భాజపా నేత ఇంటిపై మావోల బాంబుదాడి బిహార్ గయాలోని దుమారియాలో ఓ భాజపా నేత ఇంటిని బాంబులతో కూల్చివేశారు నక్సల్స్. మాజీ ఎంఎల్సీ అనుజ్కుమార్ సింగ్కు చెందిన నివాసంపై బాంబులతో దాడి చేశారు. డైనమైట్లతో పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. "కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన 20-30 మంది నక్సల్స్ ఆయుధాలు ధరించి భాజపా నేత ఇంటిపై దాడి చేశారు. ఇంటిలో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం జరగలేదు "-రాజీవ్ మిశ్రా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గయా
ఎన్నికలను బహిష్కరించాలని గోడపత్రికలను వేశారు మావోయిస్టులు. ఈ విషయంపైనా పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.