తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2019, 7:18 PM IST

Updated : Sep 28, 2019, 5:54 AM IST

ETV Bharat / briefs

రూ. 75 కోట్ల మార్కు అందుకున్న 'బాట్లా హౌస్'

వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'బాట్లా హౌస్' సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 75 కోట్ల మార్కును అధిగమించి 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇందులో జాన్​ అబ్రహం హీరో.

బాట్లా హౌస్

జాన్ అబ్రహం నటించిన కొత్త చిత్రం బాట్లా హౌస్. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసకెళ్తోంది. శనివారానికి రూ. 75 కోట్ల మార్కును అధిగమించింది. మొత్తంగా రూ. 76.57 కోట్లతో విజయవంతంగా ప్రదర్శితమవు తోంది.

2008 సెప్టెంబరు 19న దిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్​కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు. బూటకపు ఎన్​కౌంటర్​గా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు వాటిని ఎలా ఛేదించారు అనేది ప్రధాన కథాంశం.

నిఖిల్ అడ్వాణీ తెరకెక్కించిన బాట్లా హౌస్ చిత్రంలో మృణాల్ ఠాకుర్ హీరోయిన్. పింక్ సినిమాకు కథ అందించిన రితేశ్ షా ఈ సినిమాకు రచయిత.

సినిమా పాజిటివ్ టాక్​ తెచ్చుకున్నప్పటికీ అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్​ ముందు సత్తాచాటలేకపోతోంది. ఆ చిత్రం 150 కోట్లతో దూసుకెళ్తోంది.

ఇదీ చదవండి: 'మేజర్​' కోసం అడివి శేష్​ నయా అవతారం

Last Updated : Sep 28, 2019, 5:54 AM IST

ABOUT THE AUTHOR

...view details