తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2019, 3:04 PM IST

ETV Bharat / briefs

భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్​గా గ్రాహం

ఒలింపిక్స్ ముందున్న నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త కోచ్​ని నియమించింది హాకీ ఇండియా. ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్ 2022 ప్రపంచకప్​ వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్​గా గ్రాహం

భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త కోచ్​గా ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్​ను నియమించారు. హాకీ ఇండియా, సాయ్ మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 2022 హాకీ ప్రపంచకప్​ వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ వారం చివరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ప్రస్తుతం ఎన్నికల సందడిలో ఉన్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్.. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

ఆస్ట్రేలియా తరఫున 130 అంతర్జాతీయ హాకీ మ్యాచ్​లాడిన గ్రాహం, 1992 ఒలింపిక్స్​లో వెండి పతకం సాధించిన జట్టులో సభ్యుడు. 2016 రియో ఒలింపిక్స్​లో ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుకు కోచ్​గానూ వ్యవహరించాడు.

భారత జట్టు అజ్లన్ షా హాకీ టోర్నీలో అదరగొడుతోంది. ప్రస్తుతం టీం డైరక్టర్​గా ఉన్న డేవిడ్ జాన్, అనలిటికల్ కోచ్ క్రిస్ సిరియేల్లమ్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details